హైదరాబాద్‌లో దారుణం.. నాలుగేళ్ల కూతురికి విషమిచ్చిన తల్లి

-

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. నాలుగేళ్ల చిన్నారికి విషం ఇచ్చి తల్లి కూడా ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఈ ఘటన నగరంలోని కేపీహెచ్‌బీ పీఎస్ పరిధి ప్రగతినగర్‌లో ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది.

స్థానికుల కథనం ప్రకారం.. నాలుగేళ్ల చిన్నారి, తల్లి ఇంట్లో అచేతనంగా పడి ఉండటాన్ని గమనించిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు బాధితులిద్దరిని ఆసుపత్రి తరలించారు.విషం తిన్న కూతురు అప్పటికే మృతిచెందగా, తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.కాగా, తల్లి, నాలుగేళ్ల చిన్నారికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news