హైడ్రా లాగా మేము కోబ్రా తీసుకొస్తాం : పటోళ్ల కార్తీక్ రెడ్డి

-

తెలంగాణ ప్రభుత్వం చెరువులు, శిఖం భూములు, ప్రభుత్వ భూములను కబ్జా కోరల నుంచి విముక్తి చేసేందుకు, ఆక్రమణలను తొలగించేందుకు హైడ్రాను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హైడ్రా సమర్థవంతంగా పనిచేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆక్రమణలను హైడ్రా నేలమట్టం చేస్తూనే ప్రభుత్వ భూములను రక్షిస్తున్నది.

తాజాగా హైడ్రాపై మాజీ మంత్రి, చేవేళ్ల ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి తనయుడు, బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తీక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ ఆస్తుల పరిరక్షణ కోసం హైడ్రా ఎలా తీసుకు వచ్చారో.. బీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ వాళ్లు కబ్జా పెట్టిన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి కోబ్రాను తీసుకువస్తామని కార్తీక్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news