కామారెడ్డి లో దారుణం.. మైనర్ బాలికపై యువకుడు పలుమార్లు అత్యాచారం

-

ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా దేశంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు అడ్డుకట్ట పడటం లేదు. దేశంలో ఎక్కడో ఓ చోట వయసుతో సంబంధం లేకుండా అత్యాచారాలు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా కామాంధులు లో మార్పు రావడం లేదు. తాజాగా కామారెడ్డి జిల్లాలో ఓ మైనర్ బాలికపై ఓ యువకుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది.

 

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గుమస్తా కాలనీకి చెందిన ఓ మైనర్(16) బాలికపై కామారెడ్డి పట్టణానికి చెందిన కిరణ్ అనే వ్యక్తి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కిరణ్ అనే వ్యక్తి కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. కిరణ్ అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో బాలిక తండ్రి సాయిలు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన కామారెడ్డి పట్టణ పోలీసులు ఫాక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version