పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. షాపు ముందు కుర్చీలు ఎందుకు వేశారని యజమాని ప్రశ్నించడంతో అది కాస్త తీవ్ర వివాదానికి దారితీసింది. చిన్న గొడవ కాస్త పెద్దదిగా మారడంతో సదరు వ్యక్తిపై పక్క షాపు వారు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో గాయాలపాలైన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు తెలిసింది.
వివరాల్లోకివెళితే.. పాతబస్తీలోని హఫీజ్బాబా నగర్ సీ-బ్లాక్లో జకీర్ ఖాన్(62) కిరాణా దుకాణం నడుపుతున్నారు. జకీర్ షాపు ముందు ఆ పక్కనే ఉన్న పాన్షాపు యజమాని కుర్చీలు వేయడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో జకీర్పై పాన్షాపు యజమానులు దాడికి పాల్పడ్డారు. దీంతో జకీర్ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.ఆయన్ను ఆస్పత్రికి తరలించగా మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
కన్న పిల్లలను ప్రభుత్వ ఆసుపత్రిలో వదిలేసి వెళ్లిన కసాయి తల్లి
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మడలం సాతరం గ్రామానికి చెందిన నరేష్తో దివ్యకు వివాహం కాగా రోడ్డు ప్రమాదంలో నరేష్ మృతి చెందాడు. దీంతో వేరే వారితో అక్రమసంబంధం పెట్టుకొని పిల్లలను వదిలేసి వెళ్లిన తల్లి దివ్య. అనారోగ్యంతో… pic.twitter.com/lWkmVLpR1d
— ChotaNews App (@ChotaNewsApp) March 13, 2025