BREAKING : వివేకా కేసులో నిందితుడు ఉమాశంకర్ రెడ్డి భార్యపై దాడి

-

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న గజ్జల ఉమాశంకర్ రెడ్డి భార్యపై తాజాగా కొంతమంది వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. దీంతో ఆసుపత్రిలో చికిత్స కోసం చేరింది ఉమాశంకర్ రెడ్డి సతీమణి స్వాతి.

అంతేకాదు… ఉమాశంకర్ రెడ్డి కుటుంబ సభ్యులు… పులివెందుల పోలీసులకు పిర్యాదు కూడా చేశారు. దీంతో స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న పోలీసులు.. దీనిపై విచారణ ప్రారంభించారు. కాగా, వివేకా హత్య కేసులో దూకుడు పెంచిన సీబీఐ…కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి మూడో సారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 6న హైదరాబద్ సీబీఐ కార్యాలయంలో విచారణకు హజరు కావాలని రెండు రోజుల క్రిందట నోటీసు ఇచ్చిన సీబీఐ..ఎంపి తండ్రి భాస్కర్ రెడ్డి నీ కూడా విచారణకు హజరు కావాలని కోరింది. 6న హాజరు కాలేనని చెప్పిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి..తప్పక 6న హాజరు కావాలని పులివెందుల లోని ఎంపి ఇంటికి శనివారం రాత్రి వెళ్ళి సమాచారం ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version