T20 world Cup : బోణీ కొట్టిన ఆస్ట్రేలియా… దక్షిణ ఆఫ్రికా పై 5 వికెట్ల తేడాతో విజయం

-

ప్రపంచంలోని క్రికెట్ అభిమానులు.. ఎంతగానో ఎదురు చూస్తున్న టీ20 వరల్డ్ కప్ ఇవాళ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఇవాల్టి సూపర్ 12 ప్రారంభ మ్యాచ్ లో… ఆస్ట్రేలియా మరియు దక్షిణ ఆఫ్రికా తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు గ్రాండ్ విక్టరీ అందుకుంది. 118 పరుగుల చిన్న లక్ష్యాన్ని అవలీలగా సాధించింది ఆస్ట్రేలియా జట్టు.

19.4 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు కోల్పోయి.. 118 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది ఆస్ట్రేలియా జట్టు. దీంతో ఆఫ్రికా జట్టుపై ఐదు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది ఆస్ట్రేలియా జట్టు. ఆస్ట్రేలియా ఓపెనర్లు విఫలమైనప్పటికీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు రాణించగా అంతో విజయం అనివార్యమైంది. మాజీ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ 35 పరుగులు, మార్కస్ స్టోనిస్ 24 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు.

ఇక అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు ఘోరంగా విఫలమైంది. 20 ఓవర్లు ఆడిన సౌత్ ఆఫ్రికా… ఏకంగా 9 వికెట్లు కోల్పోయి 118 పరుగులు మాత్రమే సాధించింది. ఇక దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్లలో… మార్క్ రామ్ మాత్రమే 40 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఇక అటు… ఈ మ్యాచ్ లో గెలిచి… ప్రపంచ కప్ లో బోణీ కొట్టింది ఆస్ట్రేలియా.

Read more RELATED
Recommended to you

Exit mobile version