ఏపీలో ఇవాళ ఉపాధ్యాయులకు పురస్కారాల ప్రదానం

-

ఏపీలో ఇవాళ ఉపాధ్యాయులకు పురస్కారాల ప్రదానం చేయనుంది జగన్‌ సర్కార్. గురుపూజోత్సవాలను ఘనంగా నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఉపాధ్యాయులకు పురస్కారాల ప్రదానం చేయనుంది. ఇందులో భాగంగానే.. ఇవాళ విజయవాడలో ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలను అందించి సన్మానించనున్నారు సీఎం వైయస్‌ జగన్‌.

భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా గురు పూజోత్సవాలు నిర్వహిస్తున్నారు. 176 మంది టీచర్లు, అధ్యాపకులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందజేయనున్న ప్రభుత్వం… ఉదయం 10 గంటలకు విజయవాడ ఎ కన్వెన్షన్‌ సెంటర్‌లో కార్యక్రమంలో నిర్వహించనున్నారు.

పాఠశాల విద్యా శాఖ నుంచి 58 మంది ఉపాధ్యాయులు, ఇంటర్‌ విద్య నుంచి 19 మంది, ఉన్నత విద్య నుంచి 60 మంది అధ్యాపకులు, బాషా సాంస్కృతిక శాఖ నుంచి ఐదుగురు, కేజీబీవీల నుంచి ముగ్గురు జాతీయస్ధాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు ఐదుగురు ఈ పురస్కారాలను అందుకోనున్నారు. ఈ కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రి బొత్స, ఇతర అధికారులు పాల్గొననున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version