Ys Sharmila: అమిత్ షాకు షర్మిల లేఖ..మీరే రంగంలోకి దిగాలంటూ !

-

Ys Sharmila: కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు షర్మిల లేఖ రాయడం జరిగింది.తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు వాడకం పై సీబీఐ ఎంక్వైరీ జరగాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు షర్మిల లేఖ రాశారు. వెంటనే దీనిపై స్పందించి.. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు షర్మిల. ఇక అంతకు ముందు ఇదే అంశంపై షర్మిల మాట్లాడారు.

Sharmila on Amit Shah

కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. ఇంత పెద్ద విషయాన్ని చంద్రబాబు అంత ఈజీగా ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు. 100 రోజుల ముందే తెలిస్తే.. అప్పుడే ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు వైఎస్ షర్మిల. లడ్డూ వివాదం పై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.  కాంగ్రెస్ ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుందని.. సీబీఐ విచారణ కోరుతూ హోంశాఖకు లేఖ రాయనట్టు తెలిపారు. లడ్డూ వివాదం పై ప్రధాని, హోంమంత్రి జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version