జిల్లాల విభ‌జ‌న : రంగంలోకి బాల‌కృష్ణ.. నేడు మౌన దీక్ష

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో జిల్లాల ఏర్పాటుపై ఆందోళ‌న‌లు పెరిగిపోతున్నాయి. కొత్త జిల్లాల డిమాండ్లు విప‌రీతంగా పెరిగిపోతున్నాయి. అలాగే హీరో బాల‌కృష్ణ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వ‌హిస్తున్న హిందూపురం నియోజ‌క వ‌ర్గాన్ని జిల్లా కేంద్రంగా ప్ర‌క‌టించాల‌ని టీడీపీ ఆందోళ‌న‌లు చేస్తుంది. అలాగే హీరో బాల‌కృష్ణ కూడా కొత్త జిల్లాల ఏర్పాటు ప్ర‌క‌ట‌న త‌ర్వాత హిందూపురం నియోజ‌క వ‌ర్గాన్ని జిల్లా కేంద్రంగా ప్ర‌క‌టించాల‌ని ముఖ్య మంత్రి జ‌గ‌న్ కు వీడియో సందేశాన్ని పంపించారు. ఇప్పుడు తాజా గా ఆందోళ‌న కార్య‌క్ర‌మాల‌కు కూడా బాల‌య్య రంగం లోకి దిగ‌నున్నారు.

ఈ రోజు బాల‌య్య ఏకంగా మౌన దీక్ష చేయ‌నున్నారు. హిందూపురంలోని అంబెద్క‌ర్ విగ్ర‌హం వ‌ద్ద బాల‌య్య హిందూపురం నియోజ‌క వ‌ర్గాన్ని జిల్లా కేంద్రంగా ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేస్తు మౌన దీక్ష చేయ‌నున్నారు. ముందుగా బాల‌య్య నిర‌స‌న ర్యాలీలో పాల్గొన‌నున్నారు. అనంత‌రం మౌన దీక్ష లో కూర్చుంటారు. అయితే అనంత‌పురం జిల్లాను రెండు విభ‌జించి పుట్ట‌ప‌ర్తి కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేశారు. కాగ హిందూపురాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాల‌నే డిమాండ్ చాలా రోజుల నుంచి ఉంది. అయితే హిందూపురం కాకుండా పుట్ట‌ప‌ర్తి ని జిల్లా కేంద్రంగా ప్ర‌క‌టించ‌డంతో అక్క‌డ ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version