భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా.. కెసిఆర్ కోటలను బద్దలు కొడతాం – బండి సంజయ్ శపథం

-

భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా.. కెసిఆర్ కోటలను బద్దలు కొడతామని బండి సంజయ్ శపథం చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో బండి సంజయ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ… ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై టిఆర్ఎస్ పార్టీ విషప్రచారం చేస్తుందని మండిపడ్డారు.

ఒక ప్రధానమంత్రిని పట్టుకొని సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారని నిప్పులు చెరిగారు బండి సంజయ్. ఈ సభలో ఉత్సాహం చూస్తుంటే… తెలంగాణలో వచ్చేది బిజెపి సర్కారేనని పేర్కొన్నారు. తెలంగాణ యువత బిజెపి సభకు వస్తుంటే… సీఎం కేసీఆర్ కు కడుపు మంటగా ఉందని చురకలాంటించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సింహంల వస్తే… టిఆర్ఎస్ పార్టీ కుక్కలు పారిపోయాయంటూ ఎద్దేవా చేశారు. కేంద్ర నిధులతో తెలంగాణ అభివృద్ధి చెందిందని… కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసుకుంటుందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులను దారి మళ్లిస్తుందని.. కమిషన్ల కోసం కక్కుర్తి పడుతుందని కేసీఆర్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version