బీజేపీ కార్యకర్తల నినాదాలతో తెలంగాణ తల్లి పులకరించాలి : బండి సంజయ్‌

-

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఈ సభలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ మాట్లాడుతూ.. ప్రధాని మోదీపై టీఆర్ఎస్ విమర్శలు చూస్తే బాధగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ సంకల్ప సభలో పాల్గొన్న ఆయన మోదీని ఎందుకు తిడుతున్నారో టీఆర్ఎస్ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘ప్రజలకు సేవ చేస్తున్నందుకా? వ్యాక్సిన్ ఉచితంగా ఇచ్చినందుకా?. పేదలకు ఉచితంగా బియ్యం ఇస్తున్నందుకా?. కష్టకాలంలో ఉక్రెయిన్ నుంచి విద్యార్థులను తీసుకోచ్చినందుకా? అని ఆయన ప్రశ్నించారు.

అయితే.. ఈ బహిరంగ సభకు భారీగా తరలివచ్చిన బీజేపీ శ్రేణుల నినాదాలతో గడీలో ఉన్న తెలంగాణ తల్లి ధైర్యం పొందాలన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చి గడీల పాలన నుంచి తెలంగాణ తల్లి విముక్తి పొందుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఆ విధంగానే తెలంగాణ తల్లి భావిస్తోందని ఆయన అన్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులు దారి మళ్లిస్తున్నారని ఆయన మండిపడ్డారు. నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమేనని, ఆ ప్రభుత్వమే రాష్ట్రంలో ఉంటే నిధులు సక్రమంగా అందుతాయన్నారు. ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ రావడం ఖాయమన్నారు బండి సంజయ్‌

 

Read more RELATED
Recommended to you

Exit mobile version