కేసీఆర్ అహంకారానికి సమాధి కట్టిన దుబ్బాక ప్రజలు:బండి సంజయ్..!

-

దుబ్బాక ప్రజలు సీఎం కేసీఆర్ అహంకారానికి సమాధి కట్టారన్నారు బీజేపీ చీఫ్ బండి సంజయ్. రజాకార్ల వారసుడిగా నిరంకుశ పాలన సాగించిన కేసీఆర్ కుటుంబానికి దుబ్బాక ప్రజలు బుద్ది చెప్పారన్నారు. కార్యకర్తలు ఎంతో కష్టపడిన ఫలితమే దుబ్బాకలో తమ విజయమన్నారు. ఈ గెలుపును కార్యకర్తలకే అంకితం ఇస్తున్నామని తెలిపారు. పార్టీ ఆఫీసు ముందు ప్రాణత్యాగం చేసిన శ్రీనివాస్ స్ఫూర్తి కూడా ఈ విజయంలో ఉందన్నారు.

2023లోనూ ఇదే విధంగా గెలుస్తామన్నారు బండి సంజయ్. గ్రేటర్ ఎన్నికల్లో కూడా ఇదే స్పూర్తితో బీజేపీ ఘన విజయం సాధిస్తుందన్నారు.దుబ్బాకలో బీజేపీ విజయం సాధించడంతో రాష్ట్ర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ.బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు ర్యాలీగా అమరవీరుల స్థూపం వద్దకు చేరుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version