కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారు…?

-

పెద్దపల్లి జిల్లాలో తెలంగాణా బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేసారు. సెప్టెంబర్ 17 న తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరపాలని ఆయన డిమాండ్ చేసారు. అప్పుడు రోశయ్యను విమర్శించిన కెసిఆర్ ఇప్పుడు ఎందుకు భయపడుతున్నాడని ఆయన అన్నారు. కెసిఆర్ దోచుకోవటం తప్ప ప్రజలకు చేసింది ఏమి లేదన్నారు. సంపాదన కోసం కొత్త దారులు వెతుకుతున్నాడని మండిపడ్డారు. ఎంఐఎం కు తలవంచి, తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బ తీస్తున్నాడని ఆరోపించారు.

bandi sanjay

తెలంగాణ కోసం ఎందరో అమరులైన వారి చరిత్రను మరిచి నిజాంను పోగటడం సిగ్గు చేటని ఆరోపించారు. విఆర్ ఓలను తొలగించడం వల్ల ముఖ్యమంత్రి కి వచ్చే లాభం చెప్పాలని ఆయన సవాల్ చేసారు. సింగరేణి కార్మికులను మరో సారి మోసం చేయడానికి ముందుకు వస్తున్నారు అని అన్నారు. కెసిఆర్ కు సింగరేణి ఎన్నికల్లో బుద్ది చెప్పాలని సూచించారు. 2023 రాష్ట్రంలో బిజెపి జెండా ఎగరవేస్తుందని ధీమా వ్యక్తం చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version