పువ్వాడ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయిన బండి సంజయ్

-

మంత్రి పువ్వాడ పై బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రి చరిత్ర ఏంటో తెలుసుకోవాలన్న ఆయన ఖమ్మం కార్పొరేషన్ లో కాషాయ జెండా ఎగరవేసి తీరుతామని అన్నారు. బిజెపిని విమర్శిండానికి మంత్రి కి సిగ్గుండాలని, మంత్రి కి ఒక్క రోడ్డు యాక్షన్ చేపించుకునే దమ్ముందా ? అని ప్రశ్నించారు. 4 ఏళ్ళ లో నాలుగు పార్టీలు మారారు..ఈ మంత్రి మాకు నీతులు చెబుతారా..? నీ చరిత్ర ఏంటో ఖమ్మం ప్రజలకు తెలుసని అన్నారు.

bandi-sanjay

అక్రమ భూములని రెగ్యులర్ చేసుకోవడం కోసం టిఆర్ఎస్ పార్టీలో చేరారని అన్నారు. మంత్రి మెడికల్ కాలేజీ పేరుతో విద్యార్థులను మోసం చేస్తున్నారని, బిజేపి అధికారం లో రాగానే మంత్రి అక్రమాలన్ని  బయట పెడుతామని అన్నారు. తెలంగాణలో టీఆరెఎస్ పాలన పూర్తి స్థాయి లో కొనసాగే అవకాశాలు కనిపించడం లేదని, ఎప్పుడు ప్రభుత్వము పడి పోతుందో తెలియదని అన్నారు. వచ్చే రెండేళ్లు కొనసాగడం టిఆర్ఎస్ కు కష్టమేనని బండి సంజయ్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version