టీఆర్ఎస్ డౌన్ ఫాల్ స్టార్ట్…కేసీఆర్ గడి బద్దలు కొట్టడం ఖాయం : బండి సంజయ్

-

బిజేపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీకి డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందని.. రాబోయే రోజుల్లో బిజెపి అధికారాన్ని చేజిక్కించుకుంటుందని స్పష్టం చేశారు. ఈటల రాజేంద్రన్నను రమ్మని ఎప్పుడో అన్నానని.. అక్కడ మార్పు రాదు అని చెప్పినా అని పేర్కొన్నారు. కేసీఆర్ భయపడుతున్నాడని.. కేసీఆర్ నీ గడి బద్దలు కొట్టడం ఖాయమని హెచ్చరించారు. టిఆర్ఎస్ దండుపాళ్యం ముఠా హుజురాబాద్ లో అడ్డ పెట్టిందని.. ముఖ్యమంత్రి ఇన్ని రోజులు ప్రగతి భవన్ నుండి బయటకు రాలేదు..ఈటెల బయటకు రాగానే కేసీఆర్ బయటకు వచ్చాడని ఎద్దేవా చేశారు.

కోవిడ్ టైంలో ఏ మంత్రి తిరగలేదు ఒక్క ఈటెల రాజేందర్ ఒక్కడే తిరిగాడని పేర్కొన్నారు. తాము ఏ వ్యక్తి కోసం పనిచేయమని.. ధర్మం కోసం పనిచేస్తామన్నారు. కేసీఆర్ కుటుంబం మాత్రమే టీఆర్ఎస్ కు ఓనర్లలా ఉన్నారని మండిపడ్డారు. సర్పంచ్ తో మాట్లాడే స్థాయికి కెసిఆర్ చేరాడంటే అది ఈటెల దెబ్బనేనని పేర్కొన్నారు. హుజురాబాద్ లో అభివృద్ధి చేస్తాడంట? ఈటెల అభివృద్ధి చేయకుండానే ఇన్ని సార్లు గెలిచిండా ? అని టీఆర్ఎస్ ను ప్రశ్నించారు. మంత్రులు ఎవరు ఉన్నారోనని.. టీఆర్ఎస్ కార్యకర్తలు ఒకసారి ఆలోచన చేయాలని సూచించారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version