బండి సంజయ్‌ మూడో విడత ప్రజాసంగ్రామయాత్రకు ఏర్పాట్లు..

-

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్​ రెండు విడతలుగా నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్ర సక్సెస్​ కావడంతో మూడో విడత యాత్ర కోసం సన్నద్ధమవుతున్నారు. దీనిని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో ప్రారంభించడానికి రెడీ అవుతున్నారు బండి సంజయ్. ఆగస్టు 2న యాదగిరి శ్రీ లక్ష్మీ నర్సింహస్వామికి పూజలు చేసిన తర్వాత బీజేపీ చీఫ్​ యాత్రను ప్రారంభిస్తారు. ఉమ్మడి నల్గొండ, వరంగల్​ జిల్లాల్లోని రెండు లోక్​సభ, 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రోజుకు 15 కిలోమీటర్ల చొప్పున 20 రోజుల పాటు 300 కిలోమీటర్లు సాగుతుందని, ముందుగా భువనగిరి లోక్​ సభ పరిధిలోని యాదగిరిగుట్ట (ఆలేరు అసెంబ్లీ)లో మొదలవుతుందన్నారు బీజేపీ నేతలు.

ఇబ్రహీంపట్నం మినహా ఆలేరు, భువనగిరి, మునుగోడు, నకిరేకల్​, తుంగతుర్తి, జనగాం అసెంబ్లీ పరిధిలోని ప్రాంతాలతో పాటు వరంగల్​ లోక్​సభ పరిధిలోని స్టేషన్ ​ఘన్​పూర్​, పాలకుర్తి, పరకాల, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, హనుమకొండ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొనసాగుతుందన్నారు. హన్మకొండ జిల్లాలోని భద్రకాళి టెంపుల్​ వద్ద ఆగస్టు 21న ప్రజా సంగ్రామ యాత్ర ముగుస్తుంది. ఆ సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇప్పటికే మూడు రూట్​ప్లాన్లను రూట్​ మ్యాప్​కమిటీ రూపొందించింది. 12 నియోజకవర్గాల మీదుగా యాత్ర సాగినప్పటికీ.. ఏయే ప్రాంతాల మీదుగా కొనసాగాలన్నది మాత్రం ఇంకా ఫైనల్​ కాలేదని చెప్పారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version