ఢిల్లీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్…!

-

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం బండి సంజయ్ ఢిల్లీకి బయలుదేరతారు. ఉప ఎన్నికతో పాటు, హుజూరాబాద్ లో ప్రస్తుత పరిస్థితులను బండి సంజయ్ బీజేపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళనున్నారు. జేపీ నడ్డా, అమిర్ షా సహా.. హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారానికి పలువురు జాతీయ నేతలను బండి సంజయ్ ఆహ్వానిస్తున్నారు. ఈ సందర్భంగా తరుణ్ చుగ్ కుమారుడి వివాహ రిసెప్షన్ కు కూడా బండి సంజయ్ హాజరుకానున్నారు.

Bandi Sanjay Kumar | బండి సంజ‌య్

ఇదిలా ఉంటే బండి సంజయ్ ఈ నెల 20 నుండి వారం రోజులపాటు హుజూరాబాద్ నియోజకవర్గం లో పర్యటించి ప్రచారం చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారు అయ్యింది. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర అనంతరం ఇప్పటికే ఓ సారి హుజురాబాద్ లో పర్యటించారు. ఇక ఇప్పుడు బీజేపీ జాతీయ నేతలతో కలిసి బండి సంజయ్ హుజురాబాద్ లో పర్యటిస్తూ ఈటెల వైపు ప్రచార రథాన్ని ముందుకు తీసుకువెళ్ళనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version