లాయర్ గారినే మోసం చేసిన బ్యాంక్ మేనేజర్…!

-

బ్యాంకు ఉద్యోగాలు చేసే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాని ఒక మేనేజర్ మాత్రం ఏకంగా లాయర్ గారినే మోసం చేసిన ఘటన కృష్ణా జిల్లా విజయవాడలో జరిగింది. విజయవాడలోని ప్రేవేట్ బ్యాంకులో మేనేజర్ గా పనిచేస్తున్న దుర్గా ప్రసాద్ ను తెనాలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెనాలికి చెందిన న్యాయవాది పేరిట బ్యాంకు ఖాతా దుర్గాప్రసాద్ ఓపెన్ చేసాడు.

తనకు తెలియకుండానే ఖాతా తెరవటంపై న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేసారు. బ్యాంక్ ఖాతా లో 19 లక్షల రూపాయలకు పైగా లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. న్యాయవాది వద్ద కంప్యూటర్ ఆపరేటర్ గా దుర్గా ప్రసాద్ సోదరుడు పని చేస్తున్నాడు. సోదరుడి సాయంతో న్యాయవాది ఆధార్ నంబర్ సేకరించి బ్యాంకు ఖాతా ఓపెన్ చేసాడు. అక్రమ లావాదేవీల కోసమే దుర్గాప్రసాద్ ఇలా చేసినట్లు పోలీసులు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version