ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై బన్సూరి స్వరాజ్ సెటైర్లు..!

-

లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ కు ఈడీ తొమ్మిదో సారి సమన్లను జారీ చేసింది. అలాగే మరో కొత్త కేసును కూడా అతనిపై పెట్టింది. దీనిపై బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ కూతురు బన్సూరి స్వరాజ్ స్పందించి కేజీవాల్ పై సెటైర్లు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “సీఎం అరవింద్ కేజ్రివాల్ బాగా చదువుకున్నాడు. అతని కేబినెట్ మంత్రులు కూడా చదువుకున్న వారే.. కానీ చట్టం విషయానికి వస్తే, అతని జ్ఞానం శూన్యం.

మద్యం కుంభకోణానికి సంబంధించి జరుగుతున్న విచారణలో ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. ఆప్ నేతలు 100కోట్ల కిక్బ్యాక్ తీసుకున్నారని అభియోగాలు. ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన 8 సమన్లను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ ధిక్కరించారు. చట్టం ప్రకారం ఆయనపై కేసు పెట్టవచ్చని బన్సూరి స్వరాజ్ చెప్పుకొచ్చారు. కాగా ఈ కేసులో ఇప్పటికి తెలంగాణ కు చెందిన ఎమ్మెల్యే కవితను అరెస్ట్ చేయగా.. సీఎం కేజీవాల్ విచరణకు హజరైతే అతన్ని కూడా అరెస్ట్ చేస్తారనే వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version