బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ.. రూ.200 కోట్లకు చేరువలో ‘భీమ్లానాయక్’

-

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ మూవీ ‘భీమ్లా నాయక్’ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రికార్డ్ ల దుమ్ము దులుపుతోంది. మరోసారి పవన్ సత్తా ఏంటో భీమ్లానాయక్ ద్వారా రుచిచూపించాడు. గత నెల 25న విడుదలైన ఈ మూవీ అన్ని థియేటర్ల లోనూ హౌజ్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. సినిమా విడుదలైన 8 రోజుల్లోనే రూ.170 కోట్లను వసూలు చేసింది. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా భీమ్లానాయక్ నిలిచింది. అమెరికాలో కూడా మంచి వసూళ్లు సాధిస్తోంది. మరికొన్ని రోజుల్లో రూ. 200 కోట్ల క్లబ్ లో భీమ్లా నాయక్ చేరనుంది. 

మళయాళ సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాకు రిమేక్ గా వచ్చిన భీమ్లానాయక్ మూవీలో పవన్ కళ్యాన్ కు పోటీగా రానా నటించారు. వీరిద్దరికి జోడీగా నిత్యామీనన్, సంయుక్త మీనన్ నటించారు. సాగర్ కే. చంద్ర దర్శకత్వం వహించగా… స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ని త్రివిక్రమ్ అందించారు. థమన్ ఇచ్చిన మ్యూజిక్ ఇప్పటికే పెద్ద హిట్ అయింది. ఇదిలా ఉంటే తాజాగా ఇటీవల హిందీలోనూ ట్రైలర్ రిలీజ్ అయింది. హిందీలో మరెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version