గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన భూపేంద్ర పటేల్

-

ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో రికార్డు మెజారిటీతో సీట్లు గెలుచుకుని వరుసగా ఏడవ సారి బిజెపి అధికారాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. 60 ఏళ్ల భూపేంద్ర పటేల్ గుజరాత్ 18వ ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులతో పాటు బిజెపి ముఖ్యమంత్రులు హాజరయ్యారు.

ఇదే సమయంలో 16 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. భూపేంద్ర పటేల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇది వరుసగా రెండవసారి. గాంధీనగర్ లోని కొత్త సెక్రటేరియట్ భవనం సముదాయంలో ఉన్న హెలిపాడ్ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి బిజెపి కీలక నేతలతో పాటు 200 మంది సాధువులు కూడా హాజరయ్యారు. అహ్మదాబాద్ జిల్లాలోని ఘాట్లోడియా స్థానం నుంచి పోటీ చేసిన భూపేంద్ర 1.92 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version