విద్యార్థులకు బిగ్ అలర్ట్….ఈఏపీసెట్ (పాత ఎంసెట్) పరీక్షల తేదీల్లో మార్పు..!

-

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన విషయం తెలిసిందే.ఏప్రిల్ 19వ తేదీ నుంచి పోలింగ్ ప్రారంభమవుతుండగ,జూన్ 04న ఎన్నికల కౌంటింగ్ చేపట్టనున్నట్టు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు.ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మే 13న ఎన్నికలు జరగనున్నట్లు వెల్లడించింది

 

అయితే ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది.ఈఏపీసెట్ (పాత ఎంసెట్) పరీక్షల తేదీల్లో మార్పులు చేశారు. మే 13 వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ లో పోలింగ్ ఉన్న నేపథ్యంలో ఆ రోజు జరగాల్సిన ఈఏపీసెట్ పరీక్షలను మే 16కు వాయిదా వేశారు. కొత్త షెడ్యూల్ ప్రకారం మే 16, 17 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. మే 18 నుంచి 22 వరకు ఇంజినీరింగ్ పరీక్షలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో అడ్మిషన్లకు ఈఏపీసెట్ నిర్వహిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news