BIG BREAKING: కివీస్ తో మ్యాచ్ కు ముందు ఇండియాకు భారీ షాక్ ?

-

ఈ వరల్డ్ కప్ లో ఖచ్చితంగా కప్ ను కొట్టాలన్న కసితోనే ఇండియా ప్రతి మ్యాచ్ ను ఎంతో సీరియస్ గా తీసుకుని ఆడుతోంది. ఆ ఫలితమే ఇప్పటి వరకు ఓటమి అన్నదే లేకుండా ఆస్ట్రేలియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు ఆఫ్గనిస్తాన్ లను ఓడించింది. ఇక రేపటి మ్యాచ్ లో కివీస్ లాంటి కఠినమైన టీం ను ఎదుర్కోవడానికి సిద్ధమవుతోంది. ఈ పరిస్థితుల్లో ఇండియాకు భర్తీ షాక్ తగిలేలా ఉంది. ఇప్పటికే మొన్న మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేస్తూ గాయపడి ఈ మ్యాచ్ కు దూరం అవుతున్నాడు. ఇప్పుడు మరో ఆల్ రౌండర్ కూడా దూరమయ్యే ఛాన్సెస్ ఉన్నట్లు తెలుస్తోంది. లెఫ్ట్ ఆర్మ్ ఆల్ రౌండర్ జడేజా వరల్డ్ కప్ కు ముందు మోకాలికి సర్జెరీ చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఆ గాయం మళ్ళీ తిరగబెడుతున్నట్లు తెలుస్తోంది, మొన్నటి మ్యాచ్ లో ఇబ్బంది పడిన జడేజా ఇప్పుడు నొప్పిగా ఉందంటున్నాడట. మరి ఈ పరిస్థితుల్లో టీం ఇండియా యాజమాన్యం ఏమి నిర్ణయం తీసుకుంటుందా చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version