ఎగిరి ఎగిరి పడుతున్న బండి సంజయ్ కి భారీ షాక్ ?

-

తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ ఇటీవల నియమితులయ్యారు. ఆర్.ఎస్.ఎస్ నాయకుల దీవెనలు మరియు కెసిఆర్ కి దగ్గరగా ఉండే కీలక నాయకుడిని చిత్తు చిత్తుగా ఓడించిన అనుభవం ఉండటంతో సంజయ్ కి బిజెపి పార్టీ పెద్దలు అధ్యక్ష పదవిని అక్కడ చెప్పడం జరిగింది. హిందుత్వ వాదిగా బలమైన ముద్ర ఉన్న సంజయ్ హైదరాబాదులో పార్టీ కార్యక్రమంలో జరిగిన మొదటి సభలో అధ్యక్షుడిగా ప్రసంగించారు. తొలి ప్రసంగంలోనే ముఖ్యమంత్రి కెసిఆర్ ని చాలా గట్టిగా టార్గెట్ చేస్తూ ఎంఐఎం పార్టీ పై సెటైర్లు వేశారు. పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత హైదరాబాదు లో అడుగు పెట్టిన సందర్భంగా నిర్వహించిన సభలో మొదటిలోనే భారత్ మాతాకీ జై, జై శ్రీ రాం, జై బోలో హనుమాన్ కి అంటూ ప్రసంగం అంటూ ప్రసంగం స్టార్ట్ చేశారు.

 

ఈ సందర్భంగా విపక్ష పార్టీలు అధికార పార్టీలను ఎక్కి పారేసిన సంజయ్ రాబోయే 2023 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ జండా ఎగరాలని ఎగిరెగిరి పడుతూ ప్రసంగించారు. ఈ నేపథ్యంలో సొంత పార్టీలో ఉన్న నాయకులు బండి సంజయ్ వ్యవహరిస్తున్న తీరు పట్ల అసహనం చెందుతున్నారు. ఏకచ్ఛత్రాధిపత్యం తో సొంత ఎజెండాతో ముందుకు వెళ్ళి పోతున్నారు అంటూ పార్టీలో ఉన్న నాయకులు బీజేపీ అధిష్టానం బండి సంజయ్ నీ రంగంలోకి దించడం పట్లా చాలామంది ఇష్టపడటం లేదు. దీంతో ఆదిలోనే సొంత పార్టీ నుండి ఈ విధమైన రెస్పాన్స్ రావడంతో బండి సంజయ్ కి సొంత పార్టీ నేతలే షాక్ ఇచ్చినట్లయింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version