“లైగర్” మూవీ ట్రైలర్ రిలీజ్ పై బిగ్ అప్డేట్

-

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం “లైగర్”. పూరి జగన్నాథ్, నటి చార్మి, కరణ్ జోహార్ కలిసి పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాలో విజయ్‌ దేవర కొండకు జోడిగా అనన్య పాండే నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నాడు.

ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్‌ లో పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చేడు విజయ్. అంతేకాదు.. పవర్‌ ఫుల్‌ బాడీతో… రింగ్‌ లోకి ఎంట్రీ ఇచ్చే సీన్‌ అదిరిపోయింది. ఈ గ్లింప్స్‌ సినిమాపై అంచనాలను భారీ గా పెంచేశాయి. ప్రస్తుతం “లైగర్” ఫస్ట్ గ్లింప్స్ యు ట్యూబు లో ట్రేడింగ్ గా మారాయి. గ్లింప్స్ అదిరిపోవడం తో.. నెటిజెన్స్ కూడా తేగ చూస్తున్నారు.కాగా.. ఈ సినిమా ఆగస్టు 25 వ తేదీన విడుదల కానుంది.

తాజాగా ఈ చిత్రం నుంచి ఓ అదిరిపోయే మాస్ సాంగ్ ని విడుదల చేశారు చిత్ర బృందం.ఈ సినిమా ట్రైలర్ ను జులై 21వ తేదీన గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం. ఈ మాస్ ట్రైలర్ విడుదల ఒక చోట కాదు రెండు బిగ్ సిటీస్ లో జరుగుతుందని తెలిపారు.

హైదరాబాదులోని ఆర్టీసీ x రోడ్డు సుదర్శన్ థియేటర్ లో ఆరోజు ఉదయం 9:30 గంటలకు, అదే రోజు సాయంత్రం 7:30 గంటలకు ముంబైలోని అంధేరి సినీ పోలీస్ లో రెండు సార్లు రెండు భాషల్లో లైగర్ సినిమా ట్రైలర్ విడుదల అవుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ ట్రైలర్ కోసం అటు పూరి ఇటు విజయ్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version