రాహుల్ గాంధీతో బిహార్ సీఎం నితీశ్ భేటీ

-

దిల్లీ పర్యటనలో ఉన్న బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు. దాదాపు యాభై నిమిషాల పాటు ఇరువురి భేటీ కొనసాగింది. బిహార్ లో కాంగ్రెస్ మద్దతుతో మహాకూటమి ఏర్పడిన తర్వాత రాహుల్, నితీశ్ ల తొలి భేటీ ఇదే. బిహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాహుల్ గాంధీ నితీశ్ కుమార్‌కు ఫోన్‌లో శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. బీజేపీని ఓడించేందుకు అందరూ ఏకం కావాలని రాహుల్ ఈ సమావేశంలో మాట్లాడినట్లు సమాచారం.

మరోవైపు బిహార్ లో మహాకూటమితో గెలుపు పీఠం అధిష్టించిన నితీశ్ బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకం కావాలన్న నినాదాన్ని సమర్థిస్తున్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం సీఎం నితీశ్‌ కుమార్‌ దిల్లీకి వెళ్లారు. తన మొదటి రోజు పర్యటనలోనే తనకు ప్రధాని కావాలన్న కోరికలేవీ లేవని.. తన చిరునవ్వుకు కారణం బీజేపీ నుంచి విముక్తి లభించడమేనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version