టీఆర్ఎస్ ను తరిమికొడతాం..ఉద్యమకారులంతా కలిసి రండి : బండి సంజయ్

-

తెలంగాణలో టీఆర్ఎస్ ను తరిమికొడతాం.. ఈ మహోద్యమంలో ఉద్యమకారులంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. “తీన్మార్” మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ బీజేపీ లో చేరారని…తెలంగాణలో ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్న అని కొనియడారు. ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న వ్యక్తి బీజేపీలో చేరడం సంతోషంగా ఉందని తెలిపారు. హృదయపూర్వకంగా బీజేపీలోకి స్వాగతం పలుకుతున్నామని వెల్లడించారు. మల్లన్న నిఖార్సయిన తెలంగాణ వాది, ఉద్యమకారుడు. స్వార్థంతో మల్లన్న బీజేపీలో చేరడం లేదని…నరేంద్ర మోడి ప్రభుత్వం అవినీతి రహితంగా ఉంటూ పేదల కోసం పనిచేస్తోందని పేర్కొన్నారు.

తెలంగాణలో అందుకు భిన్నంగా అవినీతి, రాక్షస, కుటుంబం పాలన కొనసాగిస్తున్న కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకంగా పోరాడుతున్న వ్యక్తి మల్లన్న అని చెప్పారు. మల్లన్న తన కలంతో గళమెత్తుతుంటే జీర్ణించుకోలేని సీఎం కేసీఆర్ పోలీసు కేసులతో అనేక కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. ఇప్పటికే మల్లన్నపై కేసీఆర్ అనేక నాన్ బెయిలెబుల్ కేసులు పెట్టి వేధించారని.. అయినా వెరవని మల్లన్న తాను ఎంచుకున్న దారిలో వెళుతూ అమరవీరుల ఆశయం కోసం పోరాడుతున్నారని వెల్లడించారు. మల్లన్నపై పదేపదే కావాలని కేసీఆర్ ప్రభుత్వం కేసులు పెట్టి వేధించిందని.. మల్లన్నను చూసి మేం బాధపడ్డాం. మలన్నకు అండగా నిలబడ్డామని పేర్కొన్నారు.

తెలంగాణలోని దుర్మార్గమైన పాలనను అంతమొందించాలంటే అది బీజేపీతోనే సాధ్యమని తెలంగాణ ఉద్యమకారులు భావిస్తున్నారని.. విఠల్, మల్లన్న వంటి నేతలకు రాజకీయ స్వార్థం లేదన్నారు. పోరాడే తెలంగాణ ఉద్యమకారులు, పోరాట పటిమ ఉన్న నేతలు అని…వారి లక్ష్యాలకు అనుగుణంగా బీజేపీ ఉద్యమిస్తుందని వెల్లడించారు. తెలంగాణలో టీఆర్ఎస్ కుటుంబ, అవినీతి, నియంత ప్రభుత్వాన్ని తరిమితరిమి కొడతామని.. కేసీఆర్ రాక్షస పాలనకు చరమగీతం పాడతామని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version