హర్యాణాలో కాంగ్రెస్‌కు షాక్‌.. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు లైన్ క్లియర్

-

హర్యాణాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీకి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. 40 సీట్లను గెల్చుకున్న బీజేపీకి అధికారాన్ని చేపట్టేందుకు మరో ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరమైన వేళ… ఇండిపెండెంట్లుగా గెలిచిన ఏడుగురు ఎమ్మెల్యేలు (గోపాల్ ఖండా, రణధీర్ గోలన్, బల్రాజ్ కుందూ, రంజిత్ సింగ్, రాకేశ్ దౌలతాబాద్, సోంవీర్ సంఘ్వాన్, ధరంపాల్ గోండార్)లు కాంగ్రెస్‌కు షాకిస్తూ.. బీజేపీకి మద్దతిస్తున్నామని ప్రకటించారు.

వీరి మద్దతుతో బీజేపీ సంఖ్యాబలం మ్యాజిక్ ఫిగర్ (46) కంటే ఒకటి ఎక్కువగానే ఉండబోతోంది. ఇక ఇప్పటికే ఢిల్లీలో జేపీ నడ్డాతో హర్యానా సీఎం ఖట్టర్ సమావేశమై చేర్చించారు. రేపు హర్యానా సీఎంగా ఖట్టర్ ప్రమాణస్వీకారం చేయడం ఖాయమని బీజేపీ వర్గాల్లో ప్రచారం ఊపందుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version