TSPSC పేపర్ లీక్ నిందితులతో బిజెపి పెద్దలకు సంబంధాలున్నాయి – బాల్క సుమన్

-

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ నిందితులతో బీజేపీ పెద్దలకు సంబంధాలు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు బిఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్. పేపర్ లీక్ నిందితులతో బిజెపి నేత సునీల్ బన్సల్ కు సంబంధాలు ఉన్నాయని అన్నారు. బిఆర్ఎస్ తో పోటీ పడలేక బిజెపి నేతలు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అశాంతి, అలజడి సృష్టించేందుకు బిజెపి ప్రయత్నిస్తుందని.. ఢిల్లీ బిజెపి పెద్దల డైరెక్షన్ లోనే రాష్ట్ర బిజెపి నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.

రాజశేఖర్ రెడ్డి బీజేపీ సోషల్ మీడియాలో మెయిన్ వర్కర్ అని, బండి సంజయ్ కి ప్రశాంత్ అత్యంత సన్నిహితుడని ఆరోపించారు బాల్క సుమన్. ఇందుకు సంబంధించి కొన్ని ఫోటోలను కూడా ఆయన మీడియాకి చూపించారు. మహారాష్ట్రలో బిఆర్ఎస్ కి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక పోతున్నారని అన్నారు. ఎంపీగా బండి సంజయ్ లోక్సభ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని స్పీకర్ ని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version