బీజేపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలి: ఎంఐఎం అధినేత

-

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం ఊపు అందుకుంది. నేతలు ఒకరి పై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఈ సారి ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ భాజపా పై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. చలికాలంలో కూడా ఘటైనా వాఖ్యలతో రాజకీయంగా వేడి పుట్టిస్తున్నారు. దీంతో బల్దియా ఫైట్ లా మారిపోయింది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలంటూ మజ్లీస్ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ విరుచుకుపడ్డారు. తాను మాట్లాడటం మొదలు పెడితే మరోలా ఉంటుందని వార్నింగ్ ఇచ్చాడు. ఈ సారి పోటీ హైదరాబాద్‌ వర్సెస్‌ భాగ్యనగర్‌ మధ్యే అంటూ కొత్త డైలాంగ్ పేల్చారు‌.

ఢిల్లీ నుంచి కట్ట కట్టుకుని వచ్చే నేతలు తనను ఏమీ చేయలేరన్నారు. తాను మాట్లాడటం మొదలు పెడితే మరోలా ఉంటుందని వార్నింగ్ ఇచ్చాడు. ప్రధాని మోదీని పాతబస్తీలో పర్యటించాలని సవాల్‌ విసిరారు. ఆపద సమయంలో ముస్లింలందరూ ఏకం కావాలని అసదుద్దీన్‌ ఒవైసీ పిలుపునిచ్చారు. మాటలు తూటాల్లా భాజపా పై వదిలారు. మరొ పక్కా భాజపా వీరిని ఉగ్రవాదులుగా ఎండగట్టం పై స్పందిస్తూ తమ దేశ భక్తిని తెలిపారు. మతతత్వ రాజకీయాలు చేయటం భాజపాకి అలవాటేనని ఉద్ఘాటించారు. తమను హిందూ ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని ధ్వజమెత్తారు. కానీ తమ పార్టీ తరపున చాలా మంది హిందువులకు టికెట్లు ఇచ్చామని ఓవైసీ అసద్‌ స్పష్టం చేశారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం వాడి వేడిగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ ఎన్నికల పై ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. మరో వైపు బీజేపీ దుబ్బాక ఎన్నికలను ఉధాహరణగా చూపిస్తూ రాజకీయం చూరకలు వేస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పోటా పోటీగా ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఎన్నికలను ఒక సవాల్ గా స్వీకరించి అన్నీ పార్టీ వర్గాలు పని చేస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు వస్తే కానీ, తెలియాదు. అసలు గెలుపు ఎవరిదో.

Read more RELATED
Recommended to you

Exit mobile version