అద్వానీతో బీజేపీ అగ్రనేతల భేటీ

-

దేశ మాజీ ఉప ప్రధాని, బీజేపీ కురువృద్ధుడు లాల్‌కృష్ణ అద్వానీకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించిన సంగతి తెలిసిందే.అద్వానీ భారతరత్నకు ఎంపిక అవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని ప్రధాని మోడీ అన్నారు. అంతేకాకుండా పలువురు ప్రముఖులు అద్వానీకి శుభాకాంక్షలు తెలుపుతూ…దేశ అభివృద్ధికి అద్వానీజీ చేసిన కృషిని మరువలేమంటూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనని కొనియాడారు.

 

మంగళవారం హోం మినిస్టర్ అమిత్ షా , బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయన నివాసానికి వెళ్లి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించినట్లుగా సమాచారం.దేశంలో బిజెపి బలపడడానికి అద్వానీ చేసిన కృషి మరువలేమని అమిత్ షా అన్నారు. రాజకీయాల్లో అనేక మందికి ఆయన ఆదర్శప్రాయుడని అమిత్ షా కొనియాడారు. ఆయన సేవలు అనేక మందికి స్ఫూర్తిదాయమని తెలిపారు. అద్వానీకి రాజకీయాల్లోనే కాకుండా ప్రజల్లో కూడా అపారమైన గౌరవం ఉందనిఅమిత్ షా తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news