ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై బిఎల్ సంతోష్ సంచలన వ్యాఖ్యలు

-

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా శామీర్పేటలో ఓ రిసార్ట్ లో జరుగుతున్న బిజెపి అసెంబ్లీ ఇన్చార్జి, విస్తారక్, పాలక్, కన్వీనర్ల భేటీలో పాల్గొన్నారు బిఎల్ సంతోష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై ఆరోపణలు చేసిన వారు పర్యావసనాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.

తాను తెలంగాణలో ఎవరికి తెలియదు కానీ అందరికీ తెలిసేలా చేశారన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం, నాయకులు ప్రజాస్వామ్యానికి శాపమని మండిపడ్డారు. తెలంగాణ తల్లికి ద్రోహం చేశారని ఆరోపించారు బిఎల్ సంతోష్. హైదరాబాద్ సంపాదనను రాజకీయాల కోసం దేశమంతా పంచుతున్నారని మండిపడ్డారు. కేంద్రంలో బిజెపిని మూడోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు జాతీయ నాయకత్వం అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహించాలని పార్టీ శ్రేణులను కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version