వలసదారుల పడవ బోల్తా.. 8 మంది దుర్మరణం.. మృతుల్లో భారతీయులు

-

కెనడా నుంచి అమెరికాకు అక్రమంగా నది దాటుతుండగా ఓ పడవ నదిలో బోల్తా పడింది. ఈ ఘటనలో భారతీయులు సహా ఎనిమిది మంది మృతి చెందారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఆరుగురి మృతదేహాల గురువారం ఉదయం లభ్యం కాగా.. మరో ఇద్దరి మృతదేహాలను కెనడా- యూఎస్​ సరిహద్దులో శుక్రవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చనిపోయిన వారిలో ఓ రొమేనియన్​ కుటుంబానికి చెందిన వ్యక్తులతో పాటు భారతీయులు కూడా ఉన్నారని అధికారులు వెల్లడించారు.

కెనడా నుంచి అక్రమంగా అమెరికాలోకి వెళ్లేందుకు ప్రయత్నించి.. సెయింట్​ లారెన్స్​ నది దాటుతుండగా పడవ బోల్తా పడింది. అందులో ఉన్న ఓ రొమేనియన్​, ఒక భారతీయ కుటుంబానికి చెందిన వ్యక్తులున్నారు. పడవ బోల్తా గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. ఏరియల్​ సర్చ్​ చేపట్టారు. ఆ పడవ నడిపిన కేసీ ఓక్స్​(30) అనే వ్యక్తి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. అయితే, అతడు చనిపోయాడా లేక బతికే ఉన్నాడా అనే విషయం తెలియలేదని పోలీసులు తెలిపారు. వాతావరణం అనుకూలించకే పడవ బోల్తా పడిందా లేక.. ఇందులో ఏమైనా స్మగ్లర్ల హస్తం ఉందా అని పోలీసులు అనుమానిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version