బాలివుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కి ఫుడ్ పాయిజన్.. హాస్పిటల్ లో ట్రీట్మెంట్

-

బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ క‌పూర్ ముంబైలోని హాస్పిటల్లో చేరింది. తీవ్ర‌స్థాయిలో ఆమెకు ఫుడ్ పాయిజ‌నింగ్ అయిన‌ట్లు సమాచారం. ఆమె తండ్రి బోనీ కపూర్ ఈ విష‌యాన్ని ద్రువీక‌రించారు. అయితే ప్ర‌స్తుతం ఆమె కండీష‌న్ బాగానే ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. మ‌రో రెండు మూడు రోజుల్లో జాన్వీ కోలుకోనున్న‌ట్లు బోనీ కపూర్తెలిపారు. ఆ త‌ర్వాతే ఆమెను ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ చేయ‌నున్నట్లు తెలుస్తోంది. గ‌త వారం ముఖేష్ అంబానీ ఇంట పెళ్లికి జాన్వీ హాజ‌రైన విష‌యం తెలిసిందే.ఇక ఈ వేడుకలో జాన్వీ ఫుల్ చిందేసింది.

ఉల్జా మూవీలో జాన్వీ న‌టిస్తోంది. ఆ ఫిల్మ్ ట్రైల‌ర్‌ను ఈ వార‌మే విడుదల చేశారు. విదేశాంగ శాఖ‌లో డిప్యూటీ హై క‌మీష‌న‌ర్‌గా చేసిన సుహానా భాటియా పాత్ర‌లో జాన్వీ నటిస్తుంది . మిస్ట‌ర్ అండ్ మిస్సెస్ మ‌హి సినిమాలో జాన్వీ న‌టించింది. జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో దేవ‌రలోనూ ఆమె న‌టిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version