తెలంగాణ ప్రభుత్వ పండగల లిస్టులో బోనాలు.. కిషన్‌రెడ్డి చెప్పినట్టే చేస్తాడా?

-

న్యూఢిల్లీ: తెలంగాణ భవన్‌లో బోనాల పండగ జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. అమ్మవారికి బోనం, పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారకు. తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ, కేంద్రప్రభుత్వం తరపున కిషన్ రెడ్డి బోనాల పండగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ బోనాల పండుగను ప్రభుత్వ పండుగల జాబితాలో చేర్చేలా కృషి చేస్తానన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా బోనాల జాతరను ఘనంగా నిర్వహించుకుంటున్నామని చెప్పారు. పంటలను రక్షించాలని, రోగాల నుంచి ప్రజలను రక్షించాలని అమ్మవారిని కోరుతూ ఈ వేడుకలు జరుపుకుంటున్నామన్నారు. కరోనా కారణంగా నిబంధనలు పాటిస్తూ బోనాల పండుగ జరుగుతోందని చెప్పారు. కరోనా మహమ్మారి నుంచి విముక్తి లభించాలని, కరోనాపై పోరులో ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉండాలని అమ్మవారిని ప్రార్ధించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు.

 

మరి కిషన్ రెడ్డి చెప్పినట్లు బోనాల పండగను తెలంగాణ ప్రభుత్వ పండుగల లిస్టులో చేర్చుతారేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version