బొండా ఉమాకు మెదడు వాపు వ్యాధి…!

-

వైసీపీ చేసిన అధివృద్ధి కార్యక్రమాల పై టీడీపీ మాజీ ఎమ్యెల్యే బోండా ఉమ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని విజయవాడ నగర అధ్యక్షుడు బొప్పన భావకుమార్ ఆరోపించారు. బోండా ఉమ అలా మాట్లాడుతుంటే ఆయనకు మెదడు వ్యాపు వచ్చిందేమో అన్న అనుమానం వస్తుందన్నారు. చంద్రబాబు అండ్ కో హైద్రాబాద్ కానీ ఏపీ లో కానీ వీళ్ళే అభివృద్ధి చేసినట్టు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. బోండా ఉమ వెన్ను పోటు పొడిచింది మా జగన్ కాదు మీ నాయకుడు చంద్రబాబని మండిపడ్డారు.

మా నాయకుడు దమ్ము,ధైర్యంతో పార్టీ నుంచి బయటికి వచ్చి రాజీనామా చేసి ఈ రోజు మా నాయకుడు సీఎం అయ్యారన్నారు. 2014 నుంచి 2019 వరకూ, ఈ సంవత్సర కాలం లో మా ప్రభుత్వం చేసిన పనులు మీరు చేసిన పనుల పై చర్చిద్దామని సవాల్ చేసారు. బోండా ఉమ, వాళ్ళ పార్టీ నాయకులు రండి నేను మా పార్టీ నాయకులు వాస్తము ఎవరు ఎంత అభివృద్ధి చేశారో చర్చిద్దామని సవాల్ చేసారు. ఏ విషయం పైన అయిన మేము చర్చించడానికి మేము సిద్ధం మీరు సిద్ధమా మీకు దమ్ము ఉందా అని నిలదీశారు. మా జగన్ పై ఎలాంటి పిచ్చి కూతలు కుసిన ఖబడ్దార్ ప్రజలు మీకు ఆ 23 సీట్లు కూడా ఈసారి ఇవ్వరన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version