నెల దాటి 20 రోజులైనా ఏపీలో జీతాలు,పెన్షన్లు రావడం లేదు !

-

నెల దాటి 20 రోజులైనా ఏపీలో జీతాలు,పెన్షన్లు రావడం లేదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ఉద్యోగులకు జీతాలు కూడా సక్రమంగా చెల్లించడం లేదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వడం లేదన్నారు. గత రెండేళ్లుగా జీతాలు ఆలస్యమైనా భరిస్తూ వస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు చెల్లించాల్సిన జీతాలు బకాయిలు, జాప్యం చేయడం ప్రభుత్వానికి అలవాటుగా మారిందని విమర్శించారు. రాష్ట్రంలో జీతాలు, పెన్షన్లు 20వ తేదీ అయిన ఇవ్వడంలేదని బోప్పరాజు వెంకటేశ్వర్లు ఆక్షేపించారు. జీతభత్యాల కోసం ఉద్యోగులు రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి తీసుకొచ్చారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version