2019 నుంచి జరిగిన స్కాంలపై మాట్లాడాలని అన్నారు. మేము 2014 నుంచి మాట్లాడాలని అడిగాం. అమరావతి భూములు, స్కిల్ స్కాంలు, అగ్రిగోల్డ్ దందాలు అన్నీ విచారణ చేయాలని అడిగాం. మాజీ ముఖ్యమంత్రిని భూ బకాసురుడు అని మాట్లాడటం సరికాదని చెప్పాం అంటూ బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖ సిట్ విచారణపై రిపోర్టులు బయట పెట్టాలని అడిగాం. నిరాధార ఆరోపణలు చేయటం సరికాదని చెప్పాం. ప్రభుత్వానికి నిర్ధిష్టమైన ఆలోచన లేదు. ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్న అధికారులపై కూడా విచారణ చేయనని కోరుతున్నాం. ప్రభుత్వానికి దశ, దిశా లేదు. ఎదుటి వాళ్ళను అవమానపరచాలన్న ఆలోచన తప్ప మరొకటి కనిపించలేదు.
2019 నుంచి జరిగిన స్కాంలపై విచారణ చేసుకోమని చెప్పాం కదా. డిజిటల్ కరెన్సీ పై మాట్లాడారు.. అది సరైనది కాదు. మాపై వచ్చిన ఆరోపణలు మేం ఖండించడం లేదు.. సమర్ధించడం లేదు. మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించమని కోరుతున్నాం. మనుషుల మీద బురద చల్లాలని చూస్తున్నారు. సభలో లేని వ్యక్తులపై మాట్లాడకూడదు. కొన్నిసార్లు అలవాటులో జరుగుతుంది. ప్రత్యేకంగా మాట్లాడితే సంప్రదాయం కాదని చెప్పాం. అమరావతిలో జరిగింది భూ స్కాం. ఏ చర్చ జరిగినా సమాధానం చెప్పేందుకు మేం సిద్ధం అర్థం లేని ఆరోపణలు చేస్తే మేం సమాధానాలు చెప్పలేం. వైసీపీ మీద.. మా నాయకుడు మీద బురద చల్లాలని ఆరోపణలు చేశారు కాబట్టే మేం సభ నుంచి వాకౌట్ చేశాం అని బొత్స సత్యనారాయణ తెలిపారు.