ఒప్పుకోకపోతే యాసిడ్ పోస్తానన్నాడు.. చివరకు ఏమయ్యాడంటే..!

-

అమ్మాయిను ప్రేమిస్తున్నానంటూ వెంటపడటం.. అందుకు వారు ఒప్పుకోకపోతే.. యాసిడ్ పోస్తానని బెదిరించడం సాధరణంగా మారిపోయాయి. హైదరాబాద్ కూకట్ పల్లిలోని ఓ కుర్రాడు ఇలాగే వేధించాడు. పొట్టకూటి కోసం దుకాణంలో పని చేసుకుంటున్న యువతి వెంటపడ్డాడు. కూకట్‌పల్లిలో నివసించే ఎస్.శ్రీనివాస్ సివిల్ సర్వేయర్ దగ్గర పనిచేస్తాడు.

సికింద్రాబాద్ జనరల్ బజార్ లోని దుకాణంలో పనిచేసే ఓ యువతిని వేధిస్తున్నాడు. తనకు ఇష్టం లేదని చెప్పినా ఆమె మాటలను పట్టించుకోకుండా వేధించాడు. ఈ విషయం యువతి పెద్దలకు చెప్పటంతో వారు అతడిని కలిసి మళ్లీ వెంటపడితే కేసు పెడతామని వార్నింగ్ ఇచ్చారు.

కొంతకాలం ఆమెకు దూరంగా ఉన్న శ్రీనివాస్.. మళ్లీ వేధింపులు ప్రారంభించాడు. మంగళవారం ఆమెను కలిసి తనను పెళ్లి చేసుకో వాలని.. లేకపోతే యాసిడ్ పోస్తానని బెదిరించాడు. దీంతో బెదిరిపోయిన ఆ యువతి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు యువతిని ప్రేమ, పెళ్లి పేరుతో బెదిరించి వేధింపులకు గురిచేస్తున్నందుకు కేసు నమోదు చేసి జైల్లో పెట్టారు.

ప్రేమ, పెళ్లి అంటూ వేధించిన ఆ యువకుడు చివరకు కటకటాలపాలయ్యాడు. ఎంతో భవిష్యత్ ఉన్న యువకులు ఇలా ప్రేమ, పెళ్లి అంటూ యువతులకు ఇష్టం లేకుండా వెంటపడి తమ జీవితాలు నాశనం చేసుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version