ఆ ఘటన తీవ్రంగా కలచివేసింది: సీఎం జగన్

-

చిత్తూరు జిల్లా బి కొత్తకోట మండలం గుట్టపాళ్యంలో తీవ్ర కలకలం రేపిన ఐదేళ్ల చిన్నారి వర్షిత హత్యాచారం కేసుపై ఏపీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. చిన్నారిపై అమానుష ఘటన తీవ్రంగా కలచివేసిందని సీఎం అన్నారు. హంతకుడిని పట్టుకుని చట్టం ముందు నిలబెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. దారుణ ఘటనకు పాల్పడ్డ వ్యక్తికి కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

ఇదిలాఉండగా.. కురబలకోట మండలం చేనేతనగర్‌లోని కల్యాణ మండపం సమీపంలో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ముదివేడు పోలీసులు శనివారం పోస్టుమార్టం రిపోర్టు వివరాలు వెల్లడించారు. చిన్నారిపై అత్యాచారం చేసి, ఆపై ఊపిరాడకుండా చేయడం వల్లే మృతి చెందిందని ధృవీకరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version