వికారాబాద్‌లో బాలుడి మిస్సింగ్ కలకలం..

-

వికారాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రాత్రి తల్లిదండ్రుల చెంత పడుకున్న బాలుడు ఉదయం లేచి చూడగానే కనిపించకుండా పోయాడు. బాధిత తండ్రి వెల్లడించిన వివరాల ప్రకారం..కర్ణాటక రాష్ట్రానికి చెందిన హుస్సేన్ భాష కొన్ని రోజులుగా జిల్లాలోని గౌతపూర్‌లో నివాసం ఉంటున్నాడు.నిన్న రాత్రి కుటుంబంతో కలిసి మల్లన్న స్వామి గుడి దగ్గర పడుకున్నట్లు తెలిపాడు.

అయితే, ఉదయం లేచి చూడగానే తన కొడుకు కనిపించకుండా పోయాడని ఆ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. బాలుడు ఉదయాన్నే లేచి నడుచుకుంటూ ఏటైనా వెళ్లిపోయాడా? లేక ఎవరైనా ఎత్తుకుపోయారా? అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇదే విషయంపై పోలీస్ స్టేషన్లో బాధిత తండ్రి ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version