బ్రేకింగ్: 5 రోజుల కూతుర్ని 75 వేలకు అమ్మింది

-

ఆర్ధిక అవసరాలు మనిషిని ఎక్కడి వరకు అయినా సరే దిగజారుస్తూ ఉంటాయి. తాజాగా ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. వారం రోజుల వయస్సుగల పాపను డెబ్భై ఐదు వేల రూపాయలకు తల్లి అమ్మేసింది. భర్త నుండి విడిపోయి రాజు అనే వ్యక్తి తో చంద్రయ్య నగర్ కు చెందిన లక్ష్మీగాయత్రి సహజీవనం చేస్తుంది. గర్బవతి కావడంతో జిజిహెచ్ లో ఆమె లక్ష్మీగాయత్రి జన్మనిచ్చింది.

వారం రోజుల వయస్సు ఉన్న పాపను డెబ్భై ఐదు వేల రూపాయలకు అమ్మేసింది. సత్యవతి అనే బ్రోకర్ ద్వారా పాపను లక్ష్మీగాయత్రి అమ్ముకుంది. వాలంటీర్ ద్వారా విషయం తెలుసుకుని పోలీసులకు చైల్డ్ లైన్ ప్రతినిధులు ఫిర్యాదు చేసారు. చైల్డ్ లైన్ అధికారుల ఫిర్యాదు తో కేసు నమోదు చేసి పాప ఆచూకీ కనుగొన్న అరండల్ పేట పోలీసులు…. పాపను ట్రేస్ చేసి చైల్డ్ లైన్ ప్రతినిధులకు అప్పగించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version