వెడ్డింగ్ ఫోటో షూట్: కొండా అంచుల్లో ప్రాణాలతో చెలగాటం!

-

ప్రస్తుత కాలంలో ఇంట్లో చిన్న శుభకార్యంలో కూడా అన్నిటికంటే ముఖం ఫోటోలు. ఫోటోలు లేకపోతే శుభకార్యం పూర్తి అయ్యిందని ఈ కాలంలో ఎవరు అనుకోరు. ఎందుకంటే ఫోటోలు పదికాలాల పాటు తీపి గుర్తులుగా దాచుకుంటారు. మరి అలాంటి ఫోటోలను ఈ కాలం వారు కొత్తగా, భిన్నంగా ఉండాలని కోరుకుంటున్నారు. కొందరైతే నెట్టింట్లో వైరల్ అయ్యేలా ప్రాణాలను పణంగా పెట్టి మరి ఫోటో షూట్ చేస్తున్నారు.

ఇక ప్రస్తుతం కొవిడ్-19 కారణంగా పెళ్లిళ్లు చాలావరకు నిరాడంబరంగా జరుగుతున్నాయి. అలాంటి వారు తమ వెడ్డింగ్ మెమోరీగా నిలిచిపోవాలని వింత ఫోటో షూట్ చేస్తున్నారు. కొందరు బురదలో ఫోటో షూట్ చేయించుకొని నెట్టింట వైరల్ గా మారితే ఇప్పుడు మరికొందరు ప్రాణాలను పణంగా పెట్టు కొండా అంచున నిలబడి కిందికి పడుతున్నట్టు ఫోటో షూట్ చేయించుకుంటున్నారు. ఏమాత్రం పట్టు తప్పిన ప్రాణాలకే ప్రమాదం.

ఇక అలానే ఇప్పుడు కూడా ఒక కొత్త జంట సరికొత్తగా ఫోటో షూట్ చేయించుకోవాలని భావించింది. ఇంకేముందు కొండల వద్దకు వెళ్లి మరి ఫోటో షూట్ చేశారు. సాధారణంగా అయితే అలాంటి ఫోటోలను సినిమాల్లో చూస్తుంటాం. కానీ ఇప్పుడు రియాలిటీలో ఓ జంట సాహసం చేసి నెటిజన్లతో చివాట్లు తింటున్నారు. అయితే ప్రాణాలకు ఎలాంటి నష్టం లేకుండా ఫోటో షూట్ చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ వారిని ఆదర్శంగా తీసుకొని ఏమి తెలియని వారు ఆలా చేస్తే ప్రాణాలు పోయే అవకాశం ఎక్కువగా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version