మోడీ పర్యటనను అడ్డుకోవడానికి బిఆర్ఎస్ కుట్ర చేస్తోంది – కిషన్ రెడ్డి

-

ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనను అడ్డుకోవాలని బిఆర్ఎస్ కుట్ర చేస్తుందని ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రధానిని తిట్టడానికే కెసిఆర్ సమయం కేటాయిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రం బంగారు తెలంగాణ కాలేదు కానీ.. ఒక కుటుంబం బంగారు తెలంగాణ అయిందని విమర్శించారు. హైదరాబాద్ లో కెసిఆర్ నిర్లక్ష్యం కారణంగా ఎంఎంటీఎస్ పెండింగ్ పడిందన్నారు.

ప్రధాని రాష్ట్రానికి వస్తే స్వాగతం పలకాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిరసనలకు దిగుతుందని, రీజినల్ రింగ్ రోడ్డును కేంద్ర ప్రభుత్వాన్ని నిధులతో పూర్తి చేస్తామని వెల్లడించారు. ప్రతిపక్షాల ఎన్నికల ఖర్చు భరించే స్థాయికి కేసిఆర్ ఎదిగారంటే.. ఆయన ఎంత సంపాదించారో అర్థం చేసుకోవచ్చన్నారు కిషన్ రెడ్డి. నాడు ప్రత్యేక తెలంగాణ వద్దన్న వారు నేడు ప్రభుత్వంలో ఉన్నారని ఆరోపించారు. ఎవరు ఎన్ని చేసినా తెలంగాణ సమాజం బిజెపిని ఆశీర్వదిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version