కడపలో వీఆర్ఏ దారుణ హత్య.. ఏకంగా డిటోనేటర్లు పేల్చి!

-

ఏపీలోని వైఎస్సార్ కడపజిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకుని తనను మందలించాడనే కారణంతో ఏకంగా ప్రియురాలి భర్తను డిటోనేటర్లు పెట్టి పేల్చి హత్యచేశాడో వ్యక్తి. ఈ ఘటన కడప జిల్లాలోని వేముల మండలం కొత్తపల్లిలో సోమవారం ఉదయం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నరసింహ, సుబ్బలక్ష్మమ్మ దంపతులు.నరసింహ వీఆర్ఏగా విధులు నిర్వహిస్తున్నాడు. అతని భార్య సుబ్బలక్ష్మమ్మకు బాబు అనే వ్యక్తితో పరిచయం ఉంది. అది కాస్త వివాహేతర బంధానికి దారి తీసింది. విషయం తెలిసిన నరసింహ, బాబుకు వార్నింగ్ ఇచ్చాడు.

దీంతో కక్ష పెంచుకున్న బాబు.. నరసింహను అడ్డుతొలగించుకోవాలని భావించాడు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి నరసింహ ఇంట్లో పడుకునే మంచం కింద డిటోనేటర్ల ను అమర్చాడు.అతడు నిద్రలోకి జారుకోగానే వాటిని పేల్చడంతో నరసింహ స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో సుబ్బలక్ష్మమ్మకు కూడా తీవ్ర గాయాలయ్యాయి.విషయం తెలియడంతో పోలీసులు సుబ్బలక్ష్మమ్మను చికిత్స కోసం వేంలపల్లి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.అనంతరం ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు.ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version