వైఎస్ కుటుంబంలో కొడాలి నాని చిచ్చు పెడుతున్నాడు : బుద్దా వెంకన్న

-

వివేకా హత్య కేసుకు సంబంధించిన కీలక అంశాలు కొడాలి నానికి తెలుసు అని ఆరోపించారు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీబీఐ అధికారులు కొడాలి నాని కూడా విచారించాలన్నారు. నానికి సీబీఐ వాళ్ళు నాలుగు తగిలిస్తే వాస్తవాలు బయటికి వస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్ కుటుంబంలో కొడాలి నాని చిచ్చు పెడుతున్నాడని బుద్దా వెంకన్న ఆరోపించారు. వైసీపీలో వర్కింగ్ ప్రెసిడెంట్ కోసం కొడాలి నాని ప్రయత్నిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కమ్మ సామాజిక వర్గం కోటాలో ఎమ్మెల్యే, మంత్రి అయిన కొడాలి నాని.. రోజూ ఆ సామాజిక నేతల్ని తిడుతున్నాడని బుద్దా వెంకన్న మండిపడ్డారు.

కొడాలి నాని ఓ ఉల్లిపాయ పకోడీ అంటూ ఎద్దేవా చేశారు బుద్దా వెంకన్న. కొడాలి నాని వాళ్ల నాన్న పేరు ఎప్పుడూ ఎందుకు చెప్పుకోడు..? అని ఆయన ప్రశ్నించారు. గుడివాడలో హరికృష్ణ పోటీ చేస్తే నాని వెన్నుపోటు వల్లే ఆయనకు నాలుగో స్థానం దక్కిందని బుద్దా వెంకన్న అన్నారు. టీడీపీలో అధికార మార్పిడి సమయంలో వైస్రాయ్ హోటల్ గేటును పట్టుకుని వేలాడింది కొడాలి నాని అని బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. చంద్రబాబు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే గతిలేక వైసీపీలో చేరాడని బుద్దా వెంకన్న అన్నారు. వైసీపీలో కూడా కొంత మంది మంచివారు ఉన్నారు వారంతా కోటంరెడ్డి బాటలో బయటికి రావాలని బుద్దా వెంకన్న పిలుపునిచ్చారు. కొడాలి నాని వైఖరి దొంగే దొంగ అన్నట్టుందని, లోకేష్ పాదయాత్ర సక్సెస్ అవ్వటంతో ఇన్ని రోజులు గొలుసులతో తాడేపల్లిలో కట్టేసిన పిచ్చి కుక్కల్ని బయటికి వదిలారని బుద్దా వెంకన్న అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version