వైఎస్ జగన్ కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన బుద్ధా వెంకన్న

-

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి రాసిన లేఖ ఆంధ్ర ప్రదేశ్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తమకు ప్రతిపక్ష హోదా కల్పించాలని స్పీకర్‌కు వైఎస్ జగన్ రాసిన లేఖకు తెలుగుదేశం పార్టీ నేతలు స్ట్రాంగ్ రిప్లై ఇస్తున్నారు.

తాజాగా జగన్ లేఖపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న స్పందించారు. ఈ మేరకు మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు బుద్దా వెంకన్న బహిరంగ లేఖ రాశారు. జగన్‌కు ఇంకా పదవీకాంక్ష తీరలేదు అని మండిపడ్డారు. ప్రతిపక్ష హోదా ఎలా దక్కితుంది అనే విషయంపై ఒకసారి రాజ్యాంగ నిపుణులను కనుక్కొని జగన్ లేఖ రాయాల్సిందని ఆయన ఎద్దేవా చేశారు.మీకు ప్రతిపక్ష హోదా లేకుండా చేసింది తాము కాదని.. ప్రజలే మీకు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారని పేర్కొన్నారు. గతంలో టీడీపీ ఎమ్మెల్యేలను లాక్కుని చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా లేకుండా చేద్దామనుకున్నారని, కానీ ఇప్పుడు మీకు ప్రతిపక్ష హోదా కాదు కదా అసెంబ్లీలో కూర్చునే అర్హత కూడా లేదని ఆయన ఎద్దేవ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version