రేపు లోక్ సభ స్పీకర్ ఎన్నిక.. వైసీపీ మద్దతు కోరిన ఎన్డీఏ

-

18వ లోక్ సభ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి.సోమవారం ,మంగళవారం సమావేశాల్లో ఎంపీలంతా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే బుధవారం నాడు స్పీకర్ ఎన్నిక జరగనుంది. సాధారణంగా ఏకగ్రీవం కావాల్సిన స్పీకర్ ఎన్నిక ఈసారి కాలేదు.స్పీకర్ ని ఎన్నుకునే విషయంలో ఎన్డీయే కూటమి ఇండియా కూటమితో చర్చించలేదన్న కారణంగా ఇండియా కూటమి తరఫున ఏం.కే. సురేష్ బరిలో నిలువనున్నారు.

ఎన్డీయే కూటమి తరఫున ఓం బిర్లా స్పీకర్ అభ్యర్థిగా ఉన్నారు.ఈ క్రమంలో ఎన్డీయే స్పీకర్ ఎన్నికలో తమ అభ్యర్థి ఓం బిర్లాకు మద్దతివ్వాలని ఎన్డీఏ వైసీపీని కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇందుకు వైసీపీ అంగీకరించినట్లు తెలుస్తోంది. మరి, లోక్ సభలో చరిత్రలోనే మొదటిసారి జరుగుతున్న స్పీకర్ ఎన్నికలో ఎలాంటి ఫలితం వస్తుందో వేచి చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Exit mobile version