ఉత్తరాదిన మండుతున్న సూర్యుడు… రెడ్ అలర్ట్ జారీ

-

సూర్యుడి వేడికి దేశంలోని ఉత్తర భారతం భగభగ మండుతోంది. ముఖ్యంగా దేశ రాజధాని న్యూ ఢిల్లీ ఎండ వేడికి ఉడుకుతోంది. భారత వాతావరణ శాఖ ప్రకారం..దేశ రాజధానిలో ఉష్ణోగ్రతలు బుధవారం రికార్డు స్థాయిలో నమోదైనట్లు వెల్లడించింది. దాదాపు 52.3 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగాయి అని పేర్కొంది.

ఈ వేడి తీవ్రత ముంగేష్‌పూర్‌లో నమోదైంది. ఉష్ణోగ్రత 50 డిగ్రీల్ సెల్సియస్‌ను అధిగమించడం నగరం చరిత్రలోనే ఇదే మొదటిసారి. ముంగేష్‌పూర్‌లోని వాతావరణ కేంద్రంలో మధ్యాహ్నం 2.30 గంటలకు 52.3 డిగ్రీల సెల్సియస్, నరేలాలో 47.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రోజుల్లో కూడా పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌,హర్యానా, చండీగఢ్‌, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్‌లలోని కొన్ని ప్రదేశాలలో హీట్ వేవ్ నుంచి తీవ్రమైన హీట్ వేవ్ పరిస్థితులను భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. మే 30 తర్వాత నుంచి హీట్ వేవ్ పరిస్థితులు క్రమంగా తగ్గుతాయని ఆశిస్తున్నట్టు ,రాబోయే 3-4 రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 3-4 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గుతాయని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version