నీతి ఆయోగ్‌ నూతన సీఈఓగా బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం

-

నీతి ఆయోగ్​కు కేంద్రం కొత్త సీఈవోను నియమించింది. మాజీ ఐఏఎస్‌ అధికారి, మాజీ కామర్స్‌ సెక్రటరీ బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం నీతి ఆయోగ్ సీఈవోగా నియమితులయ్యారు. ప్రస్తుతం సీఈఓగా ఉన్న పరమేశ్వరన్‌ అయ్యర్‌ ప్రపంచబ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా నియమితులైన నేపథ్యంలో కొత్త సీఈఓను నియమించారు.

రెండేళ్ల కాలానికి గానూ సుబ్రహ్మణ్యం ఈ పదవిలో కొనసాగుతారు. లేదంటే తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన ఆ పదవిలో ఉంటారు. ఈ మేరకు కేబినెట్‌ ఆపాయింట్స్‌మెంట్‌ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. సుబ్రహ్మణ్యం..1988 బ్యాచ్‌ జమ్మూకశ్మీర్‌ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. ఆయన ఇండియా ట్రేడ్‌ ప్రమోషన్‌ ఆర్గనైజేషన్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పనిచేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version